ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

  • 'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు
  • అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ
  • మొదటి 10 రోజుల పాటు వర్తించనున్న కొత్త ధరలు
  • మార్చి 19న ఉగాది కానుకగా సినిమా గ్రాండ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు ముందే సందడి మొదలైంది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉగాది పండగ కానుకగా ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, సినిమా విడుదలయ్యే మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెంచుకోవచ్చు. ఇక మార్చి 19న తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షోల కోసం టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.


Pawan Kalyan
Ustaad Bhagat Singh
AP Government
Ticket Prices Hike
Harish Shankar
Sreeleela
Mythri Movie Makers
Telugu Movie
Gabbar Singh

More Telugu News